రాంషా సాహిత్యం – వ్యక్తిత్వం
– మాల్యశ్రీ (అభ్యుదయ జూన్-ఆగష్టు, 1992). రాంషా పేరు చెప్పగానే అభిసారిక’ పత్రికా సంపాదకుడుగానే ఈ తరం వారందరికీ అర్థమవుతుంది. కాని అంతకు చాలా కాలం క్రితమే ఆయన లబ్ధప్రతిష్టుడైన రచయిత. తన కథల ద్వారా, నవలల ద్వారా, నాటకాల ద్వారా, కవితల ద్వారా, విమర్శల ద్వారా ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘రాంషా’ అనే కలంపేరు ధరించక ముందు ఆయన దర్భా వెంకట రామశాస్త్రి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో 1924 జూలై 30వ తేదీన జన్మించాడు. కాకినాడ పి.ఆర్. కాలేజీలో ఎఫ్.ఎ. చదువుతుండగానే ‘శిలాప్రతిమ’ అనే నాటిక రచించి రజత పతకం బహుమతి పొందాడు. ఆ రోజుల్లో ఆయన…